Home » JDS
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చేదు అనుభవం ఎదురైంది. సామాజిక మాధ్యమాల్లో రేవణ్ణను సంబంధించినట్టు చెబుతున్న ఒక అశ్లీల వీడియో పోస్ట్ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తొలివిడత ప్రచారం మలివిడత నామినేషన్ల హోరు రాష్ట్రంలో ఎన్నికల వేడి పెంచుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్లకు ముందే ఒక విడత ప్రచారం ముగించిన ప్రధాని మరో పది రోజుల్లో రెండుసార్లు రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత, మండ్య లోక్సభ అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్ పెట్టారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని అయిదు రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీలో సైతం బీజేపీ తన సత్తా చాటుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో మొత్తం 130 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నారు.
కర్ణాటకలోని మండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ( Lok Sabha Elections ) టికెట్ ఆశించి భంగపడిన సుమలత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
పోలింగ్ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు.
కర్ణాటకలో పొత్తులతో లోక్సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల పంపకాలు ఖరారు అయ్యాయి. మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
జేడీఎస్తో తమ పొత్తు కొనసాగుతుందని, చిన్నచిన్న అపోహలు ఉంటే వాటిని సరిదిద్దుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర(BJP state president B Y Vijayendra) ప్రకటించారు.
మండ్య లోక్సభ స్థానం బీజేపీ(BJP)తో పొత్తులో భాగంగా జేడీఎస్ పరం కావడంతో ఇక్కడి నుంచి కుమారస్వామి లేదా నిఖిల్కుమార్లలో ఒకరు అభ్యర్థి కానున్నారు. జేడీఎస్ పార్టీ రెండు నెలల కిందటే మండ్యనుంచి మాజీ మంత్రి పుట్టరాజు పోటీ చేసేలా సూచించింది.
లోక్సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.