Share News

Congress: మహారాష్ట్రలో ఆ 8 స్థానాలపై కాంగ్రెస్ కూటమిలో విభేదాలు..?

ABN , Publish Date - Feb 23 , 2024 | 04:24 PM

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఎక్కువ స్థానాలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. 39 సీట్లను ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. 8 సీట్లలో ఇండియా కూటమిలో విభేదాలు వచ్చాయి.

Congress: మహారాష్ట్రలో ఆ 8 స్థానాలపై కాంగ్రెస్ కూటమిలో విభేదాలు..?

ముంబై: లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో (SP) పొత్తు ఖరారయ్యింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో (AAP) కలిసి పోటీ చేయనుంది. మహారాష్ట్రలో పాత మిత్రులు ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

వీబీఏ పార్టీ సీట్లపై సందిగ్ధం..?

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ఎక్కువ స్థానాలు అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. 39 సీట్లను ఉద్దవ్ థాకరే, శరద్ పవార్, ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. 8 సీట్లలో ఇండియా కూటమిలో విభేదాలు వచ్చాయి. ముంబైలోని రెండు, దక్షిణ మధ్య, నార్త్ వెస్ట్‌ ముంబైలో 8 స్థానాల కోసం కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పట్టు బడుతున్నాయి. దాంతోపాటు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ సీట్ల అంశంపై సందిగ్ధత నెలకొంది. ప్రకాష్ అంబేద్కర్‌కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ తమకు 5 సీట్లు కావాలని అడగడంతో సీట్ల ప్రకటన ఆలస్యం అవుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ 47 చోట్ల పోటీ చేసింది. ఒక్క స్థానంలో కూడా అభ్యర్థి గెలవలేరు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 236 స్థానాల్లో బరిలోకి దిగింది. ఒక్క స్థానం గెలవలేక పోయింది.

Election Schedule: మార్చి 13 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..? ఏఐ సేవల వినియోగం

2019లో ఇలా

2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. శివసేన 23 సీట్లలో పోటీ చేసి 18 చోట్ల విజయం సాధించింది. ముంబై సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లో సీట్లను గెలుచుకుంది. 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం చంద్రాపూర్ ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. శరద్ పవార్ ఎన్సీపీ 19 చోట్ల పోటీ చేసి 4 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 25 చోట్ల పోటీ చేసి 23 స్థానాలను గెలిచి సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రం మహా రాష్ట్ర అనే సంగతి తెలిసిందే. ఇక్కడ ఎక్కువ లోక్ సభ సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పాత మిత్రులతో వరసగా సంప్రదింపులు జరుపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Election Schedule: మార్చి 13 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..? ఏఐ సేవల వినియోగం

Updated Date - Feb 23 , 2024 | 04:53 PM