Share News

Bangalore: 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. డ్రమ్ములో పడేసి..

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:10 PM

బెంగళూరులోని కేఆర్.పుర లో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పడేసిన ఘటనతో ఐటీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Bangalore: 65 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. డ్రమ్ములో పడేసి..

బెంగళూరులోని కేఆర్.పుర లో దారుణం జరిగింది. 65 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పడేసిన ఘటనతో ఐటీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిక్కబళ్లాపూర్ జిల్లాకు చెందిన సుశీలమ్మ పదేళ్లుగా కేఆర్.పురలోని నిసర్గ లే అవుట్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బెంగళూరులో ఆమె తన చిన్న కూతురితో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె, కుమారుడు సైతం అదే ప్రాంతంలో ఉంటున్నారు. సుశీలమ్మకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆమెకు దినేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

కొన్నాళ్లుగా సుశీలమ్మ కనిపించలేదు. ఆమె కుటుంబసభ్యులు అన్ని చోట్లా వెతికారు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్ద ఉన్న ఓ డ్రమ్ము నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పాట్ కు చేరుకుని డ్రమ్మును పరిశీలించారు. అందులో ఉన్న వాటిని చూసి అవాక్కయ్యారు. మృతదేహం నుంచి కాళ్లు, చేతులు వేరు చేసి ఉండటం, డెడ్ బాడీ కుళ్లిపోయి ఉండటం చూసి కేసు నమోదు చేసుకున్నారు.


సుశీలమ్మతో పరిచయం ఉన్న దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను ప్రశ్నిస్తున్నారు. అయితే డబ్బు కోసమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దినేష్‌ని విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు కేఆర్.పుర పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 02:10 PM