Share News

Pune Car Crash: పూణె కారు ప్రమాదంలో కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ రిపోర్ట్‌నే మార్చేసిన డాక్టర్స్

ABN , Publish Date - May 27 , 2024 | 11:32 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Porche Car Accident) కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ని అధికారులు...

Pune Car Crash: పూణె కారు ప్రమాదంలో కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఆ రిపోర్ట్‌నే మార్చేసిన డాక్టర్స్
Porsche Car Accident Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Porsche Car Accident) కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్‌ని అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ (17 ఏళ్లు) రక్త నమూనా పరీక్ష నివేదికను ఇద్దరు వైద్యులు మార్చేసినట్లు తేలింది. దీంతో.. ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒకరు ఆసుపత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవారే అని, మరొకరు డాక్టర్ శ్రీహరి హర్నోల్ అని పూణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. ఆ ఇద్దరు వైద్యులు సాసూన్ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.


టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?

కారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ మైనర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సాసూన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు అతని రక్త నమూనాలను సేకరించారు. అయితే.. అతని రక్త నమూనాల్లో ఎటువంటి ఆల్కహాల్ ఆనవాలు లేవని ఆ ఇద్దరు డాక్టర్లు నివేదిక ఇచ్చారు. కానీ.. పోలీసులకు అనుమానం రావడంతో, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో నిందితుడు తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దీంతో.. రక్త నమూనా పరీక్ష నివేదికను ఆ ఇద్దరు వైద్యులు మార్చినట్లు పోలీసులు ధృవీకరించి, వారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ పోలీసులు చేసిన మరో మంచి పనేమిటంటే.. ప్రమాదం జరిగిన రోజున నిందితుడి మరో రక్త నమూనాను డీఎన్ఏ కోసం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఆ రెండు తప్పిదాలే సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాయా?

కాగా.. మే 19వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఇంజినీర్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ కేసులో జువైనల్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయగా.. దానిపై తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో.. జువెనైల్ జస్టిస్ బోర్డ్ తీర్పును సవరించి, బాలుడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపింది. మరోవైపు.. రియల్టర్ అయిన నిందితుడి తండ్రి ఈ కేసుని తప్పుదోవ పట్టించి, తన కుమారుడ్ని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఈ కేసులో తమ డ్రైవర్‌నే ఇరికించాలని చూశారు. కొందరు పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలూ వచ్చాయి. దీంతో.. నిందితుడి తండ్రి, రెండు బార్‌ల సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 11:32 AM