Share News

Viral Video: భారత సంతతి వైద్యురాలికి ఎలాన్ మస్క్ సాయం!

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:11 AM

సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్‌(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు.

 Viral Video: భారత సంతతి వైద్యురాలికి ఎలాన్ మస్క్ సాయం!

సోషల్ మీడియా(social media)లో గతంలో వెలుగులోకి వచ్చిన క్రౌడ్ ఫండింగ్(crowdfunding) విధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇటివల ఈ అంశంపై టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్(elon musk) కొనుగోలు చేసిన ట్విట్టర్ స్పందించింది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్‌(Kulwinder Kaur gill)కు రెండు కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే వారు ఎందుకు సాయం చేస్తామని చెప్పారు, ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

2020 వేసవిలో లాక్‌డౌన్ సమయంలో కెనడాలో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె సోషల్ మీడియాలో ధైర్యంగా బహిరంగంగా పోస్టులు చేశారు. కెనడా(canada)లో ఇమ్యునాలజీ, పీడియాట్రిక్స్‌లో నిపుణురాలైన వైద్యురాలైన గిల్ ఆమె కోవిడ్-సంబంధిత ట్వీట్ల కారణంగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. ఆ క్రమంలో లీగల్ ఫీజు 300,000 CAD (రూ. 1,83,75,078) కోసం క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సహాయం చేయాలని కోరారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న ఎలాన్ మస్క్ స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ట్వీట్‌కు రిప్లై ఇస్తూ వెల్లడించారు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X డాక్టర్ గిల్ పక్షాన ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ లాక్‌డౌన్(lock down) ప్రయత్నాలు, పబ్లిక్ టీకా వంటి అంశాలకు వ్యతిరేకంగా గిల్ ట్విట్టర్‌లో బహిరంగంగా పోస్టులు చేశారు. ఆ క్రమంలో ఆమెను మీడియా ఎలా నిషేదిస్తుందని ప్రశ్నించింది. ఇది మాజీ ట్విట్టర్ మేనేజ్‌మెంట్ సహా అక్కడి మీడియా తీసుకున్న నిర్ణయమని గుర్తు చేసింది. ఎవరికైనా వారి అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని వెల్లడించింది.

స్వేచ్ఛా వాక్ ప్రజాస్వామ్యానికి పునాది, దానికి అన్ని రూపాల్లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తామని తెలిపింది. అంతేకాదు అలాంటి వారిని రక్షించడానికి మేము చేయాల్సినంత చేస్తామని X తెలిపింది. ఈ క్రమంలో మేము స్వేచ్ఛగా మాట్లాడే మీ హక్కును రక్షించడానికి ఎల్లప్పుడూ పోరాడుతామని స్పష్టం చేసింది. మరోవైపు డాక్టర్ గిల్ 23 మంది వైద్యులు, జర్నలిస్టులు, వార్తా సంస్థలపై కూడా దావా వేశారు. ఆ వ్యక్తులపై పరువు నష్టం కేసు పెట్టారు. అయితే ప్రజల భాగస్వామ్యానికి వ్యతిరేకంగా వేసిన వ్యూహాత్మక వ్యాజ్యాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Miss Universe: చరిత్ర సృష్టించిన ఆ దేశం.. తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో!

Updated Date - Mar 28 , 2024 | 10:13 AM