Share News

YSRCP: రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు..

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:08 AM

ఏపీలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటూ వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో మరింత రెచ్చిపోతున్నారు. దెందులూరు కాంగ్రెస్ ఆలపాటి నరసింహ మూర్తి కాన్వాయ్‌పై వై సీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆయన కారును ధ్వంసం చేశారు. దళిత మహిళలపై దాడి చేశారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

YSRCP: రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు..

ఏలూరు: ఏపీలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల ప్రచారాన్ని అడ్డుకుంటూ వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో మరింత రెచ్చిపోతున్నారు. దెందులూరు కాంగ్రెస్ ఆలపాటి నరసింహ మూర్తి కాన్వాయ్‌పై వై సీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారు. ఆయన కారును ధ్వంసం చేశారు. దళిత మహిళలపై దాడి చేశారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. దెందులూరు మండలం గంగన్నగూడెం వద్ద వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అనుచరులు అరాచకం సృష్టించారు.

‘గ్లాసు’పై కుట్ర


లింగపాలెం మండలం భోగోలు గ్రామంలో టీడీపీ ప్రచార వాహనంపై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ప్రచార రథంపై ఉన్న టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఫ్లెక్సీని వైసీపీ కార్యకర్తలు చింపివేశారు. ఈ క్రమంలోనే టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ ప్రచార రథం ఆటో డ్రైవర్‌పై వైసీపీ కార్యకర్త చెప్పుతో దాడి చేశాడు. పైగా మా గ్రామంలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశాడు. టీడీపీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషిస్తూ వైసీపీ కార్యకర్త హంగామా సృష్టించాడు.

రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి

తుది సంఖ్యను ప్రకటించని ఈసీ

Updated Date - Apr 30 , 2024 | 07:08 AM