Share News

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది.. ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్

ABN , Publish Date - May 09 , 2024 | 06:27 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: వారి జనాభా పెరిగింది..  ప్రత్యేక చట్టం తెస్తాం: రాజాసింగ్
MLA Rajasingh

సూర్యాపేట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


దేశంలో హిందూ జనాభా 7% తగ్గి, ముస్లిం జనాభా 43% పెరిగిందని అన్నారు. భారత్ ఇస్లాం కంట్రీగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ముస్లిం జన సంఖ్య పెరుగుదలపై ప్రత్యేక చట్టం తెస్తామని ఉద్ఘాటించారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే తమ సత్తా ఏంటో చూపిస్తామని మందలించారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.

Free Bus Scheme: మహిళ తిట్లు.. డ్రైవర్ పాట్లు.. ఆగిపోయిన బస్సు!

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 06:59 PM