Share News

Kadiyam Srihari: కడియం శ్రీహరి మేకవన్నే పులి

ABN , Publish Date - May 07 , 2024 | 02:16 PM

కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Kadiyam Srihari: కడియం శ్రీహరి మేకవన్నే పులి
Kadiyam Srihari

వరంగల్: కడియం శ్రీహరి (Kadiyam Srihari) దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు. కడుపులో కత్తి పెట్టుకుని తిరిగే వ్యక్తి అని.. పలువురు దళితులను ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి వైఖరిపై కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైందని ఆరోపించారు. వరంగల్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆరూరి రమేష్ మాట్లాడారు.


వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థిపై సందేహం కలుగుతుందని ఆరూరి రమేష్ సందేహాం వ్యక్తం చేశారు. అభ్యర్థి కడియం శ్రీహరా..? లేదంటే కావ్య అనేది అర్థం కావడం లేదన్నారు. కడియం శ్రీహరి అణగదొక్కుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని గుర్తుచేశారు. వరంగల్‌కు నేను పక్కా లోకల్ అని ఆరూరి రమేష్ వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గుంటూరుకు చెందిన వారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అని తెలిపారు. కడియం శ్రీహరి కులంపై జాతీయ స్థాయి కమిషన్ వేసి నిజానిజాలు వెలికితీస్తామని స్పష్టం చేశారు. దాంతో నిజమైన దళితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయ పడ్డారు.



Read Latest
Telangana News and National News

Updated Date - May 07 , 2024 | 02:16 PM