Share News

Maha Shivaratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:34 AM

Andhrapradesh: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.

Maha Shivaratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం

నంద్యాల, మార్చి 8: శ్రీశైలంలో (Srisailam Temple) మహాశివరాత్రి (Mahashivratri ) బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసి పోగా.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు మొక్కలు తీర్చుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నందివాహనంపై భక్తులకు స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ప్రభొత్సవం నిర్వహించనున్నారు. రాత్రి పదిగంటలకు ఆలయంలో నవనందుల పాగాళంకరణ అనంతరం స్వామిఅమ్మవార్ల కళ్యాణాన్ని దేవస్థానం నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి..

TDP: సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న లోకేష్

Womens Day: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 12:04 PM