Share News

Nalgonda: దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...

ABN , Publish Date - May 24 , 2024 | 12:27 PM

కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడి భార్య మృతిచెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. గురువారం నల్లగొండ(Nalgonda) జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం

Nalgonda: దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...

- కారు బోల్తా.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

- ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

నల్లొండ: కుటుంబ సమేతంగా దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా కారు బోల్తా పడి భార్య మృతిచెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. గురువారం నల్లగొండ(Nalgonda) జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌(Hyderabad)లోని కొండాపూర్‌కు చెందిన చలువాది వెంకటశివ(33), ఆయన భార్య రేఖప్రియాంక(31) ఇద్దరూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు. తమ కుమారులు నిక్షిత్‌(6), తేజ్‌వర్ధన్‌(3)తో కలిసి దైవదర్శనం నిమిత్తం ఈ నెల 21న తిరుపతి బయలుదేరారు. సొంత కారుకు హైదరాబాద్‌కు చెందిన కడియపుడి మహేంద్రను డ్రైవర్‌గా మాట్లాడుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాటలు.. రెండు పబ్‌ల నిర్వాహకులపై కేసు


దర్శనం అనంతరం బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ దాటిన తర్వాత గురువారం తెల్లవారుజామున డ్రైవర్‌ అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ఉన్న రేఖప్రియాంక అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటశివ, ఇద్దరు కుమారులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వెంకటశివను గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 24 , 2024 | 12:27 PM