Share News

Bengaluru: దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ముక్కలుగా చేసి.. అడవి జంతువులకు పడేశారు..

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:46 AM

బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు.. డబ్బు కోసం దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా

Bengaluru: దారుణంగా హత్య చేసి.. శరీరాన్ని ముక్కలుగా చేసి.. అడవి జంతువులకు పడేశారు..

బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు.. డబ్బు కోసం దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి అడవి జంతువులకు వేశారు. ఈ ఘటనతో నగరంలోని మల్లేశ్వరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురుసిద్ధప్ప అనే వ్యక్తిని ఈ నెల ఒకటో తేదీన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఆయన భార్యకు ఫోన్‌ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగదు తీసుకున్నప్పటికీ గురుసిద్ధప్పను దుండగులు విడిచిపెట్టలేదు. అతన్ని వదిలేస్తే తమ విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న అనుమానంతో గురుసిద్ధప్పను మంచినబెలె అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. గురుసిద్ధప్ప మద్యం మత్తులో ఉన్న సమయంలో అతనిని హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేశారు. వాటిని అడవిలో అక్కడక్కడా పడేశారు. ఆ మరుసటి రోజు గోవాకు వెళ్లి పార్టీ చేసుకున్నారు.

డబ్బు ఇచ్చినా తన భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో గురుసిద్ధప్ప భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో అడవిలో శరీరభాగాలను గుర్తించారు. వాటిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సంజయ్‌, ఆనంద్‌లను జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే కేసులో తిమ్మ, హనుమంత అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 08:46 AM