Share News

Bengaluru: అది జరిగితేనే మనకు మొదటి రాత్రి.. భర్త తీరుతో అవాక్కైన భార్య..

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:42 AM

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కట్న కానుకలు వద్దు.. నువ్వు ఉంటే చాలన్నాడు. యువతి తల్లిదండ్రులనూ ఒప్పించాడు.

Bengaluru: అది జరిగితేనే మనకు మొదటి రాత్రి.. భర్త తీరుతో అవాక్కైన భార్య..

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కట్న కానుకలు వద్దు.. నువ్వు ఉంటే చాలన్నాడు. యువతి తల్లిదండ్రులనూ ఒప్పించాడు. ఇదంతా నిజమేనని నమ్మడమే ఆమె పాలిట శాపంగా మారింది. పెళ్లయినా శారీరకంగా దూరంగా ఉండటం, సరిగ్గా మాట్లాడకపోవడంతో ఆమె తీవ్ర "మనోవేదకు గురైంది. మరోవైపు.. నువ్వే ప్రాణమన్న భర్త నుంచి వేధింపులు స్టార్ట్ అయ్యాయి. పెళ్లికి ముందు కట్నం వద్దని చెప్పి.. పెళ్లి తర్వాత ప్లేట్ ఫిరాయించేశాడు. కట్నం కావాల్సిందేనని పట్టుబట్టాడు. అడిగినంత ముట్టజెప్పాల్సిందేనని కరాఖండీగా తేల్చేశాడు. అంతే కాకుండా మొత్తం డబ్బు ఇస్తేనే.. మొదటి రాత్రి అని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఏం చేయాలో తెలియక.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.. కట్ చేస్తే..

బెంగళూరుకు చెందిన అవినాశ్ వర్మ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అతనికి 2022 జూన్‌ 6న వివాహమైంది. పెళ్లి చేసుకునే సమయంలో తనకు కట్నం ఏమి వద్దని చెప్పాడు. అయితే కొన్నాళ్లు గడిచిన తర్వాత కట్నం, లాంఛనాలు కావాలని భార్యను, అత్తామామలను వేధించడం మొదలుపెట్టాడు. అవినాశ్ ఒత్తిళ్లు తట్టుకోలేక వారు రూ.5.8 లక్షలు ఇచ్చారు. ఇవి చాలవని, ఇంకా తీసుకురావాలంటూ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. మిగిలిన నగదు ఇస్తేనే మొదటి రాత్రి అని చెప్పినట్లు బాధితురాలు వాపోయారు. డబ్బు ఇవ్వకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు.


భర్త వేధింపులు తగ్గకపోగా.. రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో ఇక చేసేదేమీ లేక అవినాశ్ వర్మపై బసవగుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 11:42 AM