Share News

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 09:54 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి ఘటనను ఎలాగైనా టీడీపీ నేతల మెడకు చుట్టి తద్వారా లబ్ది పొందాలని అధికార పక్షం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమపై గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది.

YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై రాళ్ళ దాడి ఘటనను ఎలాగైనా టీడీపీ నేతల మెడకు చుట్టి తద్వారా లబ్ది పొందాలని అధికార పక్షం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమపై గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారు. మరికాసేపట్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఈ విషయమై మీడియా ముందుకు రానున్నారు. కావాలని కేసుల్లో టీడీపీ నేతలను ఇరుకిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత బోండా ఉమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్‌కు వెళ్ళిపోయినట్టు సమాచారాం.

AP Politics: జగన్‌.. ఇక నీ ఆటలు సాగవు.. బాలయ్య మాస్ వార్నింగ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 17 , 2024 | 09:54 AM