Pawan Kalyan: పార్టీలో వారికి సముచిత స్థానం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 19 , 2024 | 06:22 PM
రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిధి కోసం రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సోమవారం పవన్ సమావేశం అయ్యారు.
విశాఖపట్నం: రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నిధి కోసం రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సోమవారం పవన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు. 2019 తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు వచ్చే టిక్కెట్ల కన్నా.. భవిష్యత్తులో మరిన్ని పదవులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు టీడీపీలో రెండు సార్లు కీలక పదవి వచ్చేలా చేశానని.. అలాంటిది పార్టీ కోసం కష్టపడే వారిని వదిలేయబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..