Share News

Andhra Pradesh: మానవత్వం మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:16 PM

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా విచ్చలవిడిగా నేరాలు జరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

Andhra Pradesh: మానవత్వం  మంటగలిసింది.. శిశువు మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు..

సమాజంలో మానవ విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా విచ్చలవిడిగా నేరాలు జరిగిపోతున్నాయి. క్షణికావేశంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఆవేశంలో చేసే పనికి జీవితమంతా ప్రాయశ్చిత్తంలో కూరుకుపోతున్నారు. తాజాగా ( Andhra Pradesh ) అల్లూరి జిల్లా పాడేరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. రోజుల వ్యవధిలో పుట్టిన బిడ్డను పాడేరు ఎంపీడీఓ కార్యాలయం పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు.


Elections 2024: కుంభకర్ణుడిలా ఎన్నికల సమయంలో నిద్ర లేచారు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు..

రోడ్డు పక్కన పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్న ఘటన చూపరులను కలచివేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్ కు చేరుకుని కుక్కలు పీక్కోని తినగా మిగిలిన భాగాన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ దేహంలో నడుము భాగం నుంచి కాళ్ల వరకు పూర్తిగా తినేయడంతో బొడ్డు వద్ద మాత్రం ఒక స్టిక్కర్ మిగిలి ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Crime News: మహిళపై అరాచకం.. అలా చేసిందని అర్ధ నగ్నంగా ఊరేగింపు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 14 , 2024 | 04:18 PM