Share News

Roja: పవన్‌తో పాటు బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:51 PM

రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పవన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయిందని ప్రశ్నించారు.

Roja: పవన్‌తో పాటు బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..

విశాఖ: రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా? అని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి రోజా (Minister Roja) ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు పవన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత బండ్ల గణేష్‌ (Bandla Ganesh)పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్ళయిందని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దగ్గర ఊడిగం చేస్తూ అథ: పాతాళానికి వెళ్ళింది పవన్ కల్యాణేనన్నారు. బూత్ కమిటీలు మనకు ఉన్నాయా అంటూ కేడర్‌పై మండిపడడం సిగ్గు చేటని రోజా అన్నారు.

పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్‌ను తప్పుబట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామన్నారు. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించిందన్నారు. ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంప్ కార్యాలయం అవుతుందని.. లేదంటే టూరిజం భవనాలుగా ఉంటాయన్నారు. 7'o క్లాక్ బ్లేడ్ తో కోసుకుని చస్తానన్న గణేష్ స్వశక్తితో ఎదుగుతున్న మహిళల పట్ల నీచంగా మాట్లాడడం ఆయన నైజమనిరోజా అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 01:52 PM