Home » Roja
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది...
రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.
రుషికొండపై మాజీ మంత్రి రోజా ట్వీట్కు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండ విషయమై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించారు. రోజాని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలతో పాటు నాడు చెప్పిన త్రి మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని వెల్లడించారు. ఓటమి కారణంగా రోజాకు మతి చెడిందని ఎద్దేవా చేశారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఏపీలో మంత్రులంతా దాదాపు ఇంటి బాట పడుతున్నారు. వారిలో రోజా కూడా ఒకరు. రెండు రౌండ్లు పూర్తవగానే రోజా ఇంటి బాట పట్టారు. వైసీపీలో ఎగిరెగిరి పడిన నేతల్లో రోజా ఒకరు. ఆమె నోటికి ఎవరైనా భయపడాల్సిందే. నియోజకవర్గానికి చేసిందేమీ లేదు కానీ పార్టీకి మాత్రం అన్నీ తానయ్యారు. అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కాదు.
ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ సంస్థలు స్పష్టం చేశాయి. విజయం తమదేనని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని తేల్చి చెబుతున్నారు. ఆ జాబితాలో మంత్రి ఆర్కే రోజా చేరారు.
నగరి అసెంబ్లీ సీటులో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కు ఎనిమిది రోజులే గడువు ఉండటంతో పంటర్లు ఎగబడుతున్నారు. రూ.పది వేలు మొదలుకుని రూ.పది లక్షల వరకూ బెట్టింగ్ పెడుతున్నారు. పోలింగ్ తర్వాత విహార యాత్రలకు వెళ్లిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండటంతో బెట్టింగ్లకు ఊపు వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.
నగిరి నియోజకవర్గాన్ని దోచేసిన మంత్రి రోజాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు సీపీఐ జాతీయ నేత నారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ తిరుపతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో రోజా ఊళ్లకు ఊళ్లే దోచేసిందన్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాతో నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచేసిందని అన్నారు. నగిరిలో మంత్రి రోజా పాలనలో దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి ఎక్కువైందన్నారు.
టాలీవుడ్ సెలబ్రిటీలు(Tollywood Celebrities) ఎంట్రీతో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు.. ఎన్డీయే కూటమి(NDA) నేతలకు సపోర్ట్గా ప్రకటనలు, ప్రచారం చేస్తుండగా.. తాజాగా జబర్దస్త్ కిరాక్ ఆర్పి(Jabardasth Kirak RP) సంచలన కామెంట్స్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!