Roja Scam: ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కాం బయటపెట్టిన భూమా అఖిలప్రియ
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:50 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రోజా స్కాం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) వైఎస్సార్సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పథకాల పేరుతో రోజా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని అఖిలప్రియ అన్నారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు టెండర్లలో తేడాలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఆ క్రమంలో రోజా ప్రజల నిధులను వ్యాపారం కోసం వాడుకోవడమే కాకుండా, సొంత ప్రయోజనాల కోసం (Roja Scam) అధికారాన్ని ఉపయోగించుకున్నారని అఖిల ప్రియ ఆరోపించారు.