Share News

AP Polls 2024: టీడీపీలోకి రఘురామ.. పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ!

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:33 AM

నరసాపురం సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..

 AP Polls 2024: టీడీపీలోకి రఘురామ.. పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ!

  • ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ?

అమరావతి/భీమవరం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): నరసాపురం సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో చంద్రబాబుతో (Chandrababu) భేటీ సందర్భంగా ఈ నిర్ణ యం జరిగినట్లు సమాచారం. శుక్రవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి ఆయన్ను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఆ సీటు పొత్తులో బీజేపీకి వెళ్లింది. తమ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ పేరును ప్రకటించింది. ఆయన్ను మార్చేందుకు సుముఖత చూపలేదని సమాచారం. దీంతో అసెంబ్లీ బరిలో రఘురామరాజును నిలపాలని నిశ్చయించినట్లు చెబుతున్నారు. కాగా.. రఘురామ గురువారం భీమవరం రానున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 08:22 AM