Home » Undi
జూన్ 4వ తేదీ లోపు మరిన్ని దాడులు జరగవచ్చని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకుడు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించే పనిలో నిమగ్నమైంది.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్ను పద్మనాభం ప్రశ్నించారు.
ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రకటించిన వారిలో నలుగురు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చింది. గురువారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జోనల్ ఇన్చార్జుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయం తెలియజేశారు..
నరసాపురం సిటింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఈ నిర్ణయం జరిగినట్లు సమాచారం..
Andhrapradesh: ఉండి టీడీపీ అసెంబ్లీ టికెట్ వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఉండి టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి హైకమాండ్ కేటాయించింది. అయితే అధిష్టానం తీరుపై మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశిస్తున్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే రామరాజుకి టికెట్ ఇచ్చారంటూ మండిపడ్డారు.