Share News

AP Elections: పవన్‌పై పద్మనాభం ఫైర్

ABN , Publish Date - Apr 26 , 2024 | 09:07 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్‌ను పద్మనాభం ప్రశ్నించారు.

AP Elections: పవన్‌పై పద్మనాభం ఫైర్

భీమవరం, ఏప్రిల్ 26: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్‌ను పద్మనాభం ప్రశ్నించారు.

AP Elections: గెలుపుపై గ్యారంటీ లేక జిత్తులమారి వేషాలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమాన్ని అణిచివేశారని.. అలాంటి ఆయనతో పవన్ కల్యాణ్ చేతులు కలిపారని విమర్శించారు. గతంలో తన కుటుంబ సభ్యులను జైల్లో బంధించారని చెప్పారు. ఆ సమయంలో తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆ క్రమంలో తాము వాష్ బేసిన్‌లో నీళ్లు తాగామని ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


నాడు తమ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం హింసిస్తుంటే.. పవన్ ఒక్క రోజు కూడా ప్రశ్నించ లేదన్నారు. ఏ స్థాయిలో ఉన్నావని నేను నీ దగ్గరకు రావాలి అంటూ పవన్‌పై పద్మనాభం నిప్పులు చెరిగారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరిన తనను నానా బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

ఇలాంటి వ్యక్తులను తాను ఎందుకు ఫాలో అవ్వాలని ప్రశ్నించారు. మీకొక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? అని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అయినా పోటీ చేస్తున్నావా? అంటూ పవన్‌పై పద్మనాభం ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు హాజరయ్యారు.

Read National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 09:07 PM