Share News

Big Breaking: మరో వైసీపీ ఎంపీ ఔట్.. త్వరలోనే ఆ పార్టీలో చేరిక..

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ(Ongole)మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy).. తెలుగుదేశం(TDP) గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 16వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 16న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో..

Big Breaking: మరో వైసీపీ ఎంపీ ఔట్.. త్వరలోనే ఆ పార్టీలో చేరిక..
MP Magunta Srinivasulu Reddy

ఒంగోలు, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ(Ongole)మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy).. తెలుగుదేశం(TDP) గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 16వ తేదీన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 16న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మాగంటి కుటుంబ సభ్యులు. కాగా, శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మాగుంట చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

మాగుంట పోటీ చేస్తారా?

ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. త్వరలో టీడీపీలో చేరనున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. ఆయనకు బదులుగా ఆయన తనయుడు రాఘవ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. రాఘవ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది టీడీపీ అధిష్టానం ప్రకటిస్తుందని చెప్పారు శ్రీనివాసులు రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 13 , 2024 | 03:52 PM