Share News

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:50 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేరుకున్నారు. బీజేపీ (BJP)తో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ (BJP) అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్‌తో పాటు తమ పార్టీ నేతలతో షకావత్ భేటీ అవుతున్నారు. ఇక నేడు ఈ భేటీ మరింత కీలకంగా మారింది. నేటితో లెక్కలు తేలిపోనున్నాయి. అలాగే ఎవరికి ఎన్ని సీట్లు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Lokesh: జగన్ బిల్డప్ బాబాయి... డ్రోన్ చూసి భయపడ్డాడు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 01:50 PM