Share News

AP News: అమరావతి రైతుల పోరాటంపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:55 PM

అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

AP News: అమరావతి రైతుల పోరాటంపై ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

కృష్ణా: అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అధారిటీ ద్వారా రైతులు కోర్టుకెళ్లవచ్చని అన్నారు. రాజకీయ పార్టీలను రైతులు నిలదీయాలని అన్నారు. న్యాయవ్యవస్థ రైతులను తక్కువగా చూస్తోందని మండిపడ్డారు. రైతుకు భూమికి ఉన్న సంబంధాన్ని అర్థంచేసుకోలేని వాళ్లు న్యాయవ్యవస్థలో ఉన్నారని చెప్పారు.

Chandrababu: జగన్ డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదు: చంద్రబాబు


రైతు తమ భూమిని కోల్పోతే కుటుంబాన్నే కోల్పోయినట్లు భావిస్తారని చెప్పారు. రైతు సంఘాలు చైతన్యవంతం కావాలని.. రైతులకు న్యాయం జరగాలనేదే తన కోరిక అని చెప్పారు. వీరవల్లిలోని కామధేను మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో గురువారం నాడు కృష్ణా మిల్క్ యూనియన్‌ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎన్వీ రమణ పాల్గొని మూడో విడత బోనస్‌ చెక్కులను రైతులకు అందజేశారు. రమణకు కృష్ణామిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు, పాలకవర్గ సభ్యులు, రైతులు సన్మానం చేశారు.

ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ... కృష్ణా మిల్క్‌ యూనియన్‌ వందలకోట్ల ఆదాయం సంపాదిస్తూ చాలా అద్భుత విజయాలను సాధిస్తోందన్నారు. రక్తాన్ని చమటగా మార్చి పంట పండిస్తోన్న రైతుకు ఆత్మగౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగరికత అభివృద్ధి చెందడానికి ముందు రాజులు రైతులను సముచితంగా గౌరవించారని తెలిపారు.నేడు రైతు వృత్తి అంటరానిదిగా మారిందనడంలో సందేహం లేదన్నారు. కోట్ల సంఖ్యలోని రైతుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయట్లేదని అన్నారు. దేశంలో వ్యవసాయం పరిశ్రమగా గుర్తింపు పొందలేదని చెప్పారు.


చట్టప్రకారం రావాల్సిన రక్షణలేవీ రైతులకు దక్కడం లేదని వివరించారు. చట్టసభల్లో రైతు ప్రతినిధులెవరూ సభ్యులుగా లేరన్నారు. రైతు నాయకులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, ధనవంతులకే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభిస్తోందని అన్నారు. దక్షిణాదిలో రైతు సంఘాల్లో ఐక్యత తక్కువని.. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సంఘాల ఐక్యత ఎక్కువని అన్నారు. ఏడాదిపాటు రైతులు ఢిల్లీలో పోరాడి మూడు రైతు చట్టాలను అమలు కాకుండా ఆపగలిగారని ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

AP News: ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలక అధికారులు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 03:55 PM