Home » Justice NV Ramana
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, అమరావతి మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య ద్వారా తాను చాలా అంశాల్లో ప్రభావితం అయ్యానని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ(justice NV Ramana) తెలిపారు.
సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీరమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానసిక స్థిమితం లేని వారే(సైకోలు) జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారని... వ్యాప్తిలోకి తెస్తారని అన్నారు. సైకోలే విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారన్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు.