Share News

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:56 PM

ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

Bhuma Akhila Priya: వైఎస్ జగన్‌‌ను కలిసేందుకు వచ్చిన అఖిల.. ఎమ్మెల్యే వర్గం రాళ్లదాడి!

నంద్యాల: ఎర్రగుంట్లలో జనంతో సీఎం జగన్ (CM Jagan) ముఖాముఖి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) వచ్చారు. ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. భూమా వర్గీయులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులపై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి (Gangula Prabhakar Reddy) చేయి ఎత్తారని భూమా అఖిల ఆరోపిస్తున్నారు.

Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

రైతులతో ముఖాముఖి సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భూమా అఖిలప్రియ వర్గంపై ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేసి,శిరివెళ్ల స్టేషన్‌కు పోలీసులు తరలించే యత్నం చేశారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు భూమా అఖిలప్రియ నిరాకరించారు. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు నడుస్తూ వస్తానంటూ స్టేషన్‌కు అఖిల ప్రియ బయలుదేరారు.

AP Elections: రాజకీయాల్లోకి స్టార్ యాంకర్..! జనసేన, వైసీపీ తరపున ప్రచారం..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 01:26 PM