Share News

Nara Lokesh: మంగళగిరిలో నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:33 PM

తనను సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్(CM Jagan) రూ.300 కోట్లు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. శనివారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం అందించిన పెన్షన్లు, సంక్షేమంపై పేటీఎం బ్యాచ్‌తో జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

Nara Lokesh: మంగళగిరిలో నన్ను ఓడించేందుకు జగన్ రూ.300 కోట్లు పంపారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: తనను సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరిలో ఓడించేందుకు సీఎం జగన్(CM Jagan) రూ.300 కోట్లు పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. శనివారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం అందించిన పెన్షన్లు, సంక్షేమంపై పేటీఎం బ్యాచ్‌తో జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది టీడీపీనేనని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చాక ఇంకా మెరుగైన సంక్షేమం అందిస్తామని తెలిపారు. జగన్ గంజాయి, ఇసుక, మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. తనను మంగళగిరిలో ఓడించేందుకు రూ.300 కోట్లు పంపించారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాయమాటలకు మోసపోవద్దని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 10:56 PM