Share News

Janasena: ఆ పని చేయొద్దు... జనసేన సైనికులకు నాగబాబు హెచ్చరిక

ABN , Publish Date - Mar 21 , 2024 | 08:27 PM

వైసీపీ(YSRCP) ట్రాప్‌లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.

 Janasena: ఆ పని చేయొద్దు... జనసేన సైనికులకు నాగబాబు హెచ్చరిక

తిరుపతి: వైసీపీ(YSRCP) ట్రాప్‌లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.

తిరుపతి అభ్యర్థి విషయంలో రీ సర్వే చేయిస్తామని నాగబాబు శ్రేణులకు హామీ ఇచ్చారు. పార్టీలో ఉన్న వారితో పాటు, టీడీపీ నుంచి జనసేనకి రావాలనుకుంటున్న వారిని కూడా రీ సర్వేలో భాగస్వాములు చేస్తామని చెప్పారు. తన అన్నా చిరంజీవి గెలిచిన సీటులో జనసేన జెండా కచ్చితంగా ఎగరాలని అందుకు తగ్గట్టు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత అభ్యర్థికి టీడీపీ, బీజేపీల నుంచి సహకారం లేదని నాగబాబుకి తిరుపతి జనసేన జిల్లా నేత ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 10:22 PM