Share News

AP Elections : పిఠాపురానికి కడప రౌడీలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:23 PM

పిఠాపురంలో తనను ఓడించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం స్పందించారు.

AP Elections : పిఠాపురానికి కడప రౌడీలు
NagaBabu

అమరావతి, ఏప్రిల్ 26: పిఠాపురంలో తనను ఓడించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం స్పందించారు.

AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు మిధున్ రెడ్డి, దాడిశెట్టి రాజా తదితర కొంత మంది వ్యక్తులను ఇక్కడ ఉంచి.. పవన్ కల్యాణ్ అపజయానికి పాటుపడాలి.. ఆయన్ని ఓడించాలని పంపించారన్నారు. కొత్తగా స్థానికులు ఇస్తున్న సమాచారం ఏమిటంటే.. పిఠాపురంలో పవన్ ఓటమి మిధున్‌రెడ్డి వల్ల కూడా కావడం లేదని చెబుతున్నారన్నారు.

AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?


ఈ నేపథ్యంలో కడప నుంచి కొంత మంది గుండాలు, కొంత మంది రౌడీలను పిఠాపురానికి పంపినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అయితే మీరు ఎంత మంది వస్తారో రండి.. ఇక్కడ మేము రెడీగా ఉన్నామన్నారు.

AP Elections: హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్ల కోసం.. క్యూ కడుతున్న నేతలు

మా పిఠాపురం ప్రజలు సైతం అందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే.. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరంలో ఉందో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరంలో ఉందన్నారు. పంపించండి ఎంత మంది గూండాలను పంపిస్తారో పంపించండంటూ వైసీపీ నేతలకు నాగబాబు సవాల్ విసిరారు.


AP Elections 2024: ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ

వాళ్లని ఎలా ఎదుర్కోవాలో.. మా మెకానిజం మాకు ఉందన్నారు. మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకు ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. మీరు మర్యాదగా ఉంటే.. మేము మర్యాదగా ఉంటామని చెప్పారు. మీరు దారి తప్పితే.. వేరే ఆప్షన్ లేదని నాగబాబు అన్నారు.

Read National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 06:26 PM