Share News

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

ABN , Publish Date - Mar 02 , 2024 | 11:41 AM

Andhrapradesh: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్... చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్‌తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు.

Vasantha Krishna Prasad: టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌

అమరావతి, మార్చి 2: వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Mylavaram MLA Vasantha Krishna Prasad) టీడీపీలో (TDP) చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నివాసానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్... అధినేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్‌తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం దక్కలేదన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నదే తన కోరికన్నారు.

Chandrababu: ప్రజాగళం పేరుతో ఈ నెల 6 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు


మైలవరం టికెట్‌పై..

కాగా.. మైలవరం టీడీపీ టికెట్‌పై వసంత కృష్ణ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సర్వేల్లోనూ మైలవరంలో తానే గెలుస్తానని తేలిందన్నారు. జగన్‌ పలిచి టికెట్‌ నీకేనని చెప్పినా వద్దని వచ్చేసినట్లు తెలిపారు. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని లేకపోతే పార్టీ కోసం పనిచేస్తానని కృష్ణప్రసాద్ తేల్చిచెప్పారు.

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై.. ఎందుకంటే..?


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 01:56 PM