Home » Mylavaram
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల పోలింగ్ అనేక ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. పోలింగ్ మొదలవక ముందు నుంచే వైసీపీ నేతల దౌర్జన్యాలు బయటబడ్డాయి. టీడీపీ నేతలపై దాడులు, కిడ్నాప్లు, బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. మైలవరంలోనూ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైలవరం దేవునిచెరువులో వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు.
మైలవరం (Mylavaram) నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని మైలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్రహీంపట్నం మండల తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. 5 నెలల్లో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్తో (Vasantha Krishna Prasad) ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి..
Andhrapradesh: ఎన్నికల వేళ అధికారపార్టీ వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. తాజాగా రెడ్డిగూడెం ఎంపీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎంపీపీతో పాటు రెడ్డిగూడెం మండలం నుంచి 60 కుటుంబాలకు పైగా ప్రజలు టీడీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో పలువురు నాయకుడు వైసీపీని వీడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డిగూడెం మండల ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు రామినేని దేవీప్రావీణ్య కూడా వైసీపీకి...
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.
Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.
నిన్ను రైటు అనుకుంది నేడు రాంగ్ అవుతుంది... నేడు రాంగ్ అనుకున్నది రేపు రైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల విషయం ఇదే జరుగుతుందని ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుతోంది.
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
Andhrapradesh: వైఎస్సార్సీపీకి గుడ్బై చెప్పేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న వసంత కృష్ణ ప్రసాద్... చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కృష్ణప్రసాద్తో పాటు మైలవరానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు.