Share News

Prajagalam: కర్నూలు జిల్లా: ఆలూరులో నేడు చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Apr 19 , 2024 | 07:02 AM

కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరులో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్‌లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.

Prajagalam: కర్నూలు జిల్లా:  ఆలూరులో నేడు చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రలో (Prajagalam) భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరు (Alur)లో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్‌లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు. కాగా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆలూరుకు రానుండటంతో గురువారం టీడీపీ నాయకులు (TDP Leaders) ఏర్పాట్లను పరిశీలించారు. ఆలూరు పట్టణ శివారులోని అగ్రహారం కొండల్లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.


టీడీపీ జోనల్‌-5 ఎన్నికల సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌, కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి, అక్కడి నుంచి రోడ్‌ షో ద్వారా అంబేడ్కర్‌ సర్కిల్‌కు చేరుకొని ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమానికి టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావాలని వీరభద్రగౌడ్‌ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లపై ఫిర్యాదులు

టీడీపీ నాయకులపై పిడిగుద్దులు

ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 07:09 AM