Share News

Kollu Ravindra: చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:48 PM

టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నంలో బూత్ కన్వీనర్ల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం నిర్వహించారు.

 Kollu Ravindra: చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పోరాడాలి

కృష్ణ (మచిలీపట్నం): టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నంలో బూత్ కన్వీనర్ల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మచిలీపట్నంలో టీడీపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం - జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కొల్లు రవీంద్ర అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 02:55 PM