Share News

Kesineni Chinni: మూడో సైకో వస్తున్నాడు.. అన్నపై తమ్ముడి మాస్ సైటెర్స్

ABN , Publish Date - Feb 12 , 2024 | 09:24 PM

గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చి అందరూ మోసపోయారని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాధ్(చిన్ని)(Kesineni Chinni) అన్నారు.

Kesineni Chinni: మూడో సైకో వస్తున్నాడు.. అన్నపై తమ్ముడి మాస్ సైటెర్స్

ఎన్టీఆర్ జిల్లా (నందిగామ): గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చి అందరూ మోసపోయారని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాధ్(చిన్ని)(Kesineni Chinni) అన్నారు. కంచికచర్ల మండలంలో సోమవారం పర్యటించారు. పెండ్యాల గ్రామాల్లో కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వౌమ్యకి భారీ ర్యాలీలతో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. నందిగామలో ఇద్దరు సైకోలతో పాటు మూడో సైకో కూడా బయలుదేరాడని ఎద్దేవా చేశారు. నందిగామలో తంగిరాల సౌమ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాలకు గానూ టీడీపీ - జనసేన కూటమి 160 స్థానాల్లో గెలవబోతోందన్నారు. అనుహ్యంగా పులివెందులలో కూడా టీడీపీ గెలవబోతుందని తెలిపారు. ఇంకా ఎన్నికలకు మనకు 65 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. ఏపీలో రాక్షస పాలనను సాగనంపాలని కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.

Updated Date - Feb 12 , 2024 | 09:37 PM