Share News

AB Venkateswararao: బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ సాయంత్రం రిటైర్..

ABN , Publish Date - May 31 , 2024 | 01:51 PM

అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..

AB Venkateswararao: బాధ్యతలు స్వీకరించిన  ఏబీ వెంకటేశ్వరరావు.. ఈ సాయంత్రం రిటైర్..
AB Venkateswara Rao

అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS Officer) ఏబీ వెంకటేశ్వర రావు (AB Venkateswararao) తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ (Printing and Stationery) డీజీ (DG)గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ (Retirement) చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో చార్జ్ తీసుకుంటున్నానని, తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ఈరోజు నా పదవీ విరమణ రోజు... ఈరోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా’’ అని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నానని... ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయని... విధుల్లో చేరానని తెలిపారు. ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానన్నారు.తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. యూనిఫాంతో రిటైర్ కావడం తన కల నెర వేరినట్లుగా భావిస్తున్నానని ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.


కాగా కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది.


ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే.. ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష గట్టింది. ఆ వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అప్పడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఐదేళ్లుగా ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన పోరాటం ఫలించి.. పదవీ విరమణ రోజు విధుల్లో చేరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ. 200 కోట్ల స్కామ్.. నిమ్మగడ్డ వాణి బాల అరెస్ట్..

ఓటమిని తట్టుకోలేక సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు: టీడీపీ నేత

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 03:36 PM