Home » IPS
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
జగన్ సర్కారుకు ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరీ వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎ్సలపై బదిలీ వేటు వేసింది.
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్ను తిరుమల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేయాలని సిఫార్సు లేఖను సమర్పించాడు.
AP Elections 2024: రాష్ట్రంలో గాలి మారుతోందని అఖిల భారత సర్వీసు అధికారులు గ్రహించినట్లుగా కనబడుతోంది. అందుకే స్వరం సవరించుకుంటున్నారు. మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా పాత సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా పరిణామాలు అధికారుల ఆలోచనా ధోరణిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయి...
తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండె పోటుతో మృతిచెందారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ డీజీగా ఉన్నారు.
అమరావతి: రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికారితో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు.
అధిక పార్కింగ్ ఫీజు వసూల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. కారులో సాధారణ దుస్తుల్లో ఉన్నది ఐపీఎస్ అధికారి అని తెలీక నోటికొచ్చినట్టు మాట్లాడి చివరకు జైలు పాలయ్యాడు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తాము చెప్పినట్లు ఎవరు వింటారో అలాంటి వారిని ఎంపిక చేసి మరీ కీలక స్థానాల్లో నియమించింది. ముఖ్యంగా దళిత అధికారుల్ని ఎన్నికల్లో పావులుగా వాడుకునే తెలివి ప్రదర్శించింది.
తిరుప్పూర్, తిరువళ్లూర్ జిల్లా ఎస్పీలు సహా 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.