Share News

AP NEWS: నాన్న పీఏ అలా చేయాల్సింది కాదు: సునీతారెడ్డి

ABN , Publish Date - Feb 22 , 2024 | 07:55 PM

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు గురువారం కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు..తమపై పెట్టిన కేసుల వివరాలపై ఎస్పీతో సునీత, రాజశేఖర్ రెడ్డి చర్చించారు.

AP NEWS: నాన్న పీఏ అలా చేయాల్సింది కాదు: సునీతారెడ్డి

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు గురువారం కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో తమకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు.. తమపై పెట్టిన కేసుల వివరాలపై ఎస్పీతో సునీత, రాజశేఖర్ రెడ్డి చర్చించారు. నాన్న (వివేకా) పీఏ కృష్ణారెడ్డి తమపై అనవసరంగా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించారని ఎస్పీకి సునీత తెలిపారు. పులివెందులకు చెందిన వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో తమపై అసభ్యంగా పోస్టులు పెట్టిన అంశాన్ని సునీత ఎస్పీకు చెప్పారు. వివేకా కేసులో తాజా పరిణామాల సందర్భంగా జరుగుతున్న అంశాలపై ఎస్పీకి సునీతారెడ్డి వివరించారు.

Updated Date - Feb 22 , 2024 | 08:23 PM