Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Ammisetti Vasu: రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదు..

ABN , Publish Date - Mar 02 , 2024 | 09:49 PM

వైసీపీ రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని ఆ పార్టీ నేత అమ్మిశెట్టి వాసు అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ...

Ammisetti Vasu: రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదు..

విజయవాడ: వైసీపీ రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నిర్ణయించుకున్నారని ఆ పార్టీ నేత అమ్మిశెట్టి వాసు అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో టీడీపీ (TDP) ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ తమ అధినేత ఆదేశాలతో టీడీపీతో కలిసి కట్టుగా పని చేసి గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా అందరం కలిసి ప్రజల్లోకి వెళదామని పిలుపునిచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారానే యువత భవిష్యత్ బంగారుమయంగా మారుతుందని తెలిపారు. ఈ రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదని పవన్ నిర్ణయించుకున్నారని చెప్పారు.

ప్రజలకు మేలు చేయాలని, అలాగే రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పొత్తు నిర్ణయాన్ని తీసుకున్నారని వాసు అన్నారు. జనసేన అభ్యర్థి పోటీ చేసిన చోట గాజు గ్లాస్‌కి, పోటీ చేయని ప్రాంతంలో సైకిల్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించే పవన్ కళ్యాణ్.. ప్రజల కోసం స్థాయి లేని వెధవలతో మాటలు పడుతున్నాడన్నారు. సొంత బాబాయిని చంపితే... దోషులను జగన్ ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. తనతో కలిసి పెరిగిన సొంత చెల్లే.. ఆ అన్న నీచత్వాన్ని బయటపెడుతోందని తెలిపారు. తన తండ్రి హత్యలో జగన్ పాత్ర ఉందని మరో చెల్లి చెబుతోందన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసి.. ఇలాంటి స్వభావం గల జగన్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి ఈ వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

Updated Date - Mar 02 , 2024 | 09:49 PM