Share News

Janasena: జనసేన పార్టీ కార్యాలయంలో బీమా చెక్కులు పంపిణీ

ABN , Publish Date - Mar 13 , 2024 | 06:27 PM

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 62 కుటుంబాలకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో పలు ప్రాంతాలలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఈ బీమా చెక్కులను అందజేశారు.

Janasena: జనసేన పార్టీ కార్యాలయంలో బీమా చెక్కులు పంపిణీ

అమరావతి: జనసేన (Janasena) పార్టీ కేంద్ర కార్యాలయంలో 62 కుటుంబాలకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో పలు ప్రాంతాలలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఈ బీమా చెక్కులను అందజేశారు. ఈ రోజు అందించిన రూ.3 కోట్ల రూపాయల విలువైన బీమా చెక్కులను చనిపోయిన కార్యర్తల కుటుంబాలకు అందేలా పవన్ కళ్యాణ్ కేటాయించారు. కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన పార్టీ.. టీడీపీ-బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 06:27 PM