Share News

CM Jagan: నేడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

ABN , Publish Date - Apr 01 , 2024 | 08:53 AM

నేడు జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రఘురామ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.

CM Jagan: నేడు జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ: నేడు ఏపీ సీఎం జగన్ (CM Jagan) బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రఘురామ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడే విచారణ జరుపనుంది. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారించనుంది.

జగన్‌ చేసింది అప్పులే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. నేడు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్‌ను సైతం రఘురామకృష్ణ రాజు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీంతో ఈ 2 పిటిషన్లపై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది.

Andhra Pradesh: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. కోర్టును ఆశ్రయించిన దస్తగిరి..

అయితే ఎన్నికల వేళ.. సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుండడం.. అనంతరం ధర్మాసనం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా దృష్టి కేంద్రీకరించనుంది. అదీకాక వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలని జగన్ కలలు కంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ పరదాల చాటున తిరిగిన ఆయన ఎన్నికలు వచ్చే సరికి ‘మేము సిద్ధం’ పేరిట జనల్లోకి అడుగుపెట్టారు. మార్చి 27న ఇడుపులపాయ నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. అలాంటి పరిస్థితుల్లో జగన్ అక్రమాస్తుల కేసు అంశంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - Apr 01 , 2024 | 08:53 AM