Home » Raghurama krishnam raju
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ దాడులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఖండించారు. నిరసనలు తెలిపే విధానాలు వేరే ఉంటాయని.. దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెదపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కొందరు వ్యక్తులు అడ్డుకుని దాడికి యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని బిహార్లో అరెస్ట్ చేశారు.
సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు జారీ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారంటూ నోటీసులు పంపారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులను భట్టి వైసీపీ సభ్యులు అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం అవుతుందని వెల్లండించారు. 60 పనిదినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకోవాలని స్పష్టం చేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీదుర్గాదేవి ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్లో దాఖలైన ఎఫ్ఐఆర్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Cyber fraud Regulation: సైబర్ క్రైమ్ను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చని రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన దుర్మార్గాలను ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకంలో టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఎండగట్టారని వక్తలు కొనియాడారు.