Home » Raghurama krishnam raju
ఉండి(Undi) నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు(Raghurama Krishnam Raju) కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు.
‘ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం. అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాలి’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను ఆయన కలిశారు.
సీఎం జగన్ (CM Jagan) తన ఎన్నికల గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం నాడు నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తనను శాశ్వతంగా నియోజకవర్గం నుంచి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలోని కూటమి క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే తన ఎంపీ సీటు పోతుందన్నారు. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారని రఘురామ వాపోయారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) స్పష్టం చేశారు. బుధవారం నాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.
నేడు జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రఘురామ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకొంది. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.
పీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు వాళ్ల పేటీఎం బ్యాచ్తో అసభ్యంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. బుధవారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ..తన దగ్గర కూడా సజ్జల, పిల్ల సజ్జల, ఇతరుల నంబర్స్ ఉన్నాయని.. తాను కూడా అలా చేయొచ్చని అన్నారు.