Share News

Prathipati Pullarao: అంబటి తలకిందులుగా తపస్సు చేసినా గెలుపు కష్టమే

ABN , Publish Date - Jan 29 , 2024 | 09:39 AM

Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.

Prathipati Pullarao: అంబటి తలకిందులుగా తపస్సు చేసినా గెలుపు కష్టమే

పల్నాడు, జనవరి 29: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Former Minister Kanna Laxminarayana) ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. రౌడీయిజం, భౌతికదాడులతో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. తొండపి ఘటనకు పూర్తి బాధ్యత మంత్రి అంబటి (Minister Ambati Rambabu), వైసీపీ నాయకత్వానిదే అని అన్నారు. అంబటి తలకిందులుగా తపస్సు చేసినా సత్తెనపల్లిలో గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే...

కాగా.. కన్నా ప్రచార కార్యక్రమంపై కొందరు వ్యక్తుల దాడి తీవ్ర కలకలం రేపింది. గత రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని తొండపి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. లైట్లు ఆర్పివేసి మరీ భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామికి, పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో తొండపిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2024 | 09:39 AM