Home » Kanna Lakshminarayana
Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు.
Andhrapradesh: బ్రిటీష్ వారికంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారం పేరుతో భారత్కు వచ్చి, సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు.
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.
ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.
Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.
దుర్మార్గపు పాలనలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అన్ని రంగాల్లో విచ్ఛిన్నమైందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం అభిమానులందరిపైనా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) పిలుపునిచ్చారు.
ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు ( YCP MLA ) మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Lakshminarayana ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
పోలీసుల చర్యలను టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. ముప్పాళ్ళ మండలం తురుకపాలెంలో టీడీపీ నేత చంద్రబాబు షూరిటి- భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాన్ని కన్నా ఆధ్వర్యంలో చేపట్టారు. అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.