Share News

Kanna Lakshmi Narayana: పల్నాడు జిల్లా: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

ABN , Publish Date - Mar 10 , 2024 | 01:16 PM

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.

Kanna Lakshmi Narayana: పల్నాడు  జిల్లా:  మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఔదార్యం

పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత (TDP Leader), మాజీ మంత్రి (Ex Minister) కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) సత్తెనపల్లి (Sattenapally)లో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సిద్ధం సభ (Siddam Sabha)కు సత్తెనపల్లి ఆర్టీసీ (RTC) డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు (Buses) లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ తన సోంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటు చేసి ప్రయాణీకులను వారి సొంత ఊళ్లకు తరలించారు. తాలుకా సెంటర్‌లో ఆటోలు పెట్టి ప్రయాణికులను తరలించారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు కన్నా చర్యలను అభినందించారు.

Updated Date - Mar 10 , 2024 | 01:18 PM