Share News

Manickam Tagore: షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తాం

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:31 PM

వైఎస్ షర్మిల ( YS Sharmila ) కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.

Manickam Tagore: షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తాం

అమరావతి: వైఎస్ షర్మిల ( YS Sharmila ) కు కాంగ్రెస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ యువతకు..ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగున్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కావాల్సిన అన్నీ ప్రాజెక్టులు ఇస్తామని మాణిక్కం ఠాకూర్ పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 08:31 PM