Share News

Atchannaidu: ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:41 PM

ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతుందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని చెప్పారు.

 Atchannaidu: ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది

అమరావతి: ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతుందని తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని చెప్పారు.

పోలీసుల ముందే వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి చేస్తున్న అక్రమ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 26 , 2024 | 05:46 PM