Share News

Kanna Lakshminarayana: వ్యతిరేకత ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు స్థానం మార్చితే గెలవలేరు

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:34 PM

ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు ( YCP MLA ) మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Lakshminarayana ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Kanna Lakshminarayana: వ్యతిరేకత ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు స్థానం మార్చితే గెలవలేరు

పల్నాడు జిల్లా: ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు ( YCP MLA ) మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ( Kanna Lakshminarayana ) ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. సత్తెనపల్లి DSP ఆదినారాయణ వైసీపీ ఎజెంట్‌గా పని చేస్తున్నారని మండిపడడ్డారు. రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరిపై కేసు ఎత్తి వేయాలని చెప్పారు. వైసీపీ పార్టీ పై 100శాతం వ్యతిరేకత ఉందన్నారు. జగన్ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని చెప్పారు.. జగన్ రోడ్డుపై తిరగలేక హెలికాప్టర్‌లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు స్థానం మార్చితే గెలవలేరని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 05:34 PM