Share News

AP NEWS: జగన్ ప్రభుత్వం మరోసారి ఆ సంస్థకు భారీ ఆఫర్

ABN , Publish Date - Feb 29 , 2024 | 06:08 PM

గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు.

AP NEWS: జగన్ ప్రభుత్వం మరోసారి ఆ సంస్థకు భారీ ఆఫర్

అమరావతి: గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ ప్రభుత్వం (Jagan Govt) రూ.1250 కోట్ల భారీ డిస్కౌంట్‌ను ఇవ్వలేదా అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(Kommareddy Pattabhiram) ప్రశ్నించారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన దోపిడీకి సహకరిస్తుందనే రాష్ట్ర ఖజానాకు చేరాల్సిన సొమ్మును జగన్ ఈ సంస్థకు దారాదత్తం చేయలేదా అని నిలదీశారు. డైరెక్టర్ మైన్స్ & జియాలజీ వెంకటరెడ్డి GST ఇంటిలిజెన్స్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) వారికి రాసిన లేఖతో సీఎం జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ సంస్థల మధ్య ఉన్న దోపీడీ బంధం బయటపడిందని చెప్పారు.

జేపీకి దోచిపెట్టిన రూ.1250కోట్లు.. కాలపరిమితి ముగిసినా సదరు సంస్థ ప్రభుత్వానికి రూ.500 కోట్లు రాష్ట్ర ఖజానాకు బకాయిపడిందని ఎవరు ఈ డబ్బులను కడుతారని నిలదీశారు. సీఎం జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, వెంకటరెడ్డిలలో ఎవరు కడతారో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. ఇసుక ఉచితంగా ఇవ్వడమే నేరంగా పరిగణిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టిన జగన్ సర్కార్, నేడు ఈ భారీ దోపిడీకి బాధ్యులైన వారిపై కేసులు పెట్టగలదా? అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు.

ఇవి కూడా చదవండి.....

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

Jawahar: పేదల్ని అప్పులపాలు చేసిన మోసగాడు జగన్ రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Feb 29 , 2024 | 06:08 PM