Share News

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:35 PM

ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ( Ponnavolu Sudhakar Reddy ) ఇకనైనా రాజకీయాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ( Bonda Uma Maheswara Rao ) అన్నారు.

Bonda Uma: పొన్నవోలు ఇకనైనా రాజకీయాలు ఆపాలి

అమరావతి: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ( Ponnavolu Sudhakar Reddy ) ఇకనైనా రాజకీయాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ( Bonda Uma Maheswara Rao ) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలు ఐదేళ్లలో 5 పైసల అవినీతిని కూడా టీడీపీ నేతలపై నిరూపించలేకపోయారని చెప్పారు. సాక్షి పత్రిక కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి రాస్తోందన్నారు. స్కిల్ కేసులో 3,300 కోట్లు అవినీతి అన్నారని, తర్వాత 317 కోట్లన్నారని.. ఆఖరికి 27 కోట్లు పార్టీ ఖాతాలోకి వచ్చాయని..దేన్ని నిరూపించలేకపోయారని మండిపడ్డారు. పొన్నవోలు సుధాకర్‌కు సాక్ష్యాలు చూపే ధైర్యముందా? అని ప్రశ్నించారు. 17ఏ మీద క్యాష్ పిటిషన్ వేశామన్నారు. ప్రభుత్వం అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. స్కిల్ కేసులో సుప్రీం కోర్టుకు సాక్ష్యాలను చూపించలేకపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వపు డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతోందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో కేబినెట్ అప్రూవల్ చేసినదాన్ని తప్పు అన్నారని చెప్పారు. సీఐడీ, వైసీపీ ప్రభుత్వం ఏఏజీ పొన్నవోలు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకోవాలని బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 10:58 PM