Atchannaidu: సచివాలయ సిబ్బందితో వైసీపీ రాజకీయాలు చేస్తోంది
ABN , Publish Date - Mar 06 , 2024 | 06:04 PM
సచివాలయం సిబ్బందితో వైసీపీ(YSRCP) రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ రాబోయే ఎన్నికల్లో గెలవాలని అక్రమాలకు పాల్పడుతోందని, పోలింగ్ బూత్ల్లో అవకతవకలు జరగకుండా చూడాలని ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం నాడు అచ్చెన్నాయుడు రెండు లేఖలు రాశారు.

అమరావతి: సచివాలయం సిబ్బందితో వైసీపీ (YSRCP) రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ రాబోయే ఎన్నికల్లో గెలవాలని అక్రమాలకు పాల్పడుతోందని, పోలింగ్ బూత్ల్లో అవకతవకలు జరగకుండా చూడాలని ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం నాడు అచ్చెన్నాయుడు రెండు లేఖలు రాశారు. ఏపీలో 3,005 సున్నితమైన పోలింగ్ బూత్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్ బూత్ల బయట, లోపల వీడియోగ్రఫీని ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్సర్వర్లను నియమించాలని సూచించారు. శాంతిభద్రతలకు బాధ్యత వహించే పోలీసు అధికారుల ఫోన్ నంబర్లను తెలియజేయాలని అన్నారు.
ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. వెంకట రమణా రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు చేస్తూ ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు మరో లేఖ రాశారు. సచివాలయం ఉద్యోగులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి సీసీఏ నిబంధనలు అధిగమించారని చెప్పారు. వైసీపీకి మద్దతుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారని లేఖలు రాశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియాపై దుర్భాషలాడి, వైసీపీకి అనుకూలంగా అతను చేసిన వీడియో క్లిప్పింగ్లను లేఖకు జత చేసి ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు అందించారు.
ఇవి కూడా చదవండి....
Venigandla Ramu: బీసీలకు చంద్రబాబు ఎంతో గౌరవం ఇస్తున్నారు
Bhuvaneswari: అనంతలో వెంకటమ్మ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి